సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను వారం రోజులపాటు నిర్వహించనున్నారు. మహిళా సాధికారత సాధనతో పాటు సామాజిక అంశాల్లో మహిళలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా సరిళ్ల వారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి సారధ్యంలో వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, కార్పొరేటర్లు సుమారు 300 మంది పాల్గొనే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సరిల్ పరిధిలో శానిటేషన్ విభాగంలో ఉత్తమ సేవలందించిన మహిళలకు ఒక్కో సర్కిల్లో ఒకొకరికి 30 మందికి సన్మానం చేస్తారు. సౌత్ జోన్లో పీడీగా పనిచేస్తున్న లావణ్య, 2023 ద్వితీయ సంసద్ ఖేల్ స్పంద్ జాతీయస్థాయి క్రీడలు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన క్రాస్ బౌ షూటింగ్లో కాంస్య పతకం సాధించినందున ఆమెను కూడా ఈ సందర్భంగా సన్మానిస్తారు. అంతే కాకుండా మహిళలచే వివిధ క్రీడా, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుమారు 35 మంది మహిళలను సన్మానించి జ్ఞాపికలు అందజేస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ సరిల్ స్థాయిలో కల్చరల్, స్పోర్ట్స్ , హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు నేటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాలని కమిషనర్ జోనల్, సరిల్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.