హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంపునకు గురవుతున్నారు. కానీ, గత పాలకులు ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు.
వరదల సమయంలో మాత్రమే కొందరు నాయకులు వచ్చి వెళ్లేవారు. తర్వాత మళ్లీ కనిపించకపోయే వారని మండిపడ్డారు. కాగా, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా 45 కోట్ల రూపాయలతో నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.