K keshava Rao | తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ వేసిందని… దాని కోసం ఆల్ పార్టీ మీటింగ్ (అఖిల పక్ష సమావేశం) పెట్టడం జరిగిందని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కే కేశవరావు మాట్లాడుతూ.. ఉద్యమకారులను గుర్తించడానికి ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. వారు ఏం కోరుకుంటున్నారు.. అభిప్రాయాలు ఏంటి..? అనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు.
విద్యార్థి సంఘాలను, అడ్వకేట్స్ , డాక్టర్లు , ఉద్యమంతో సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి మాట్లాడతామన్నారు. ఇందులో మొదటిది ఉద్యమకారులను గుర్తించడం. తొలి తరం ఉద్యమకారులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటాం.. ఉద్యమకారుల ఐడెంటిటీపై వర్క్ డివైడ్ చేస్తామని చెప్పారు. ఇది రెండవ మీటింగ్. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నాం.. తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు ఐక్యంగా అందరివీ తీసుకున్నాం.. కమిటీ నివేదికకు టైమ్ బాండ్ ఆలోచిస్తున్నామన్నారు.
Ameerpet Fire Accident | అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’