ఎల్బీనగర్, నవంబర్ 26 : ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తపేటలో ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత దేశానికి తగిన విధంగా రాజ్యాంగాన్ని రుపొందించారన్నారు. ఈ సందర్భంగా ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుపొందించిన క్రిమినల్ ఆర్డ్ పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, ప్రధాన కార్యదర్శి బి.సురేందర్కుమార్ మాట్లాడుతూ.. ప్రతిఫలం ఆశించకుండా నిరుపేద న్యాయవాదులు, బాధితుల పక్షాన నిలబడి వారికి న్యా యం జరిగే వరకు అసోసియేషన్ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పవన్కుమార్, చిం తల అరుణ, హైకోర్టు న్యాయవాదులు సి. నరేందర్, కె. శ్రీనివాస్, ఎం.సత్యనారాయణరెడ్డి, న్యూనాగోలు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సుమతిరెడ్డి, స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంతుల సురేందర్రెడ్డి , సీనియర్ నాయకుడు అనంతుల రా జారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు విష్ణుమూర్తి, శివకుమార్, నీరజ్ ఠాకూర్, ఎన్. సంతోష్కుమార్, పి. సంపత్కుమార్, కిశోర్, జి. స్వరూప, పి. ఉమాదేవి పాల్గొన్నారు.
చైతన్యపురిలో.. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చైతన్యపురిలో దళితమోర్చా ఆధ్వర్యంలో చైతన్యపురి చౌరస్తాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా, సీనియర్ దళిత నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ దళితమోర్చా కన్వీనర్ పెరికె కృష్ణ ప్రకాశ్ పూలమాల నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వినోద్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. శంకర్, నాయకులు సత్యం, కిషన్, ఉమేందర్, నవీన్ యాదవ్, కమల్భాయ్, బాలకృష్ణ, శివ. నితిన్ పాల్గొన్నారు.
కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆధ్వర్యంలో..
హయత్నగర్, నవంబర్ 26 : హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బండారి భాస్కర్, పారంద మహేశ్, శక్తిసింగ్, బాలునాయక్, జాంజ్యానాయక్, రఘుపతి పాల్గొన్నారు.
ఇన్మర్మేషన్ కాలనీలో..
అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్, జీహెచ్ఎంసీ వార్డు కమిటీ సభ్యులు కాటెపాక స్కైలాబ్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాటెపాక రమేశ్ కుమార్, దుబ్బాక నవీన్, కుర్మన్న, భరత్, కృష్ణ, జెనిగె అరవింద్, ఖాజా పాల్గొన్నారు.
నైతికతను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే..