వేసవిలో ఉచితంగా ట్యాంకర్లు
నీటి సరఫరాలో జాప్యం జరుగొద్దు
అదనపు ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి
సమీక్షలో జలమండలి ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, మార్చి 30 : వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. వేసవికాలం, రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఅండ్ఎం ఉన్నతాధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. వేసవి ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎకడ నీటికి ఇబ్బంది ఉన్నా వెంటనే ట్యాంకర్ ద్వారా సరఫరా చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే అదనపు ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని, అదనపు ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం నాటికి 98 శాతం ట్యాంకర్ బుకింగ్లను ఎప్పటికప్పుడు డెలివరీ చేస్తున్నామని, ఇదే విధంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పేరొన్నారు. సింగూరు, మంజీరా ట్రాన్స్ మిషన్ లైన్లు ఎకడైనా పాడైతే వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టాలని, పనులు జరుగుతున్నప్పుడు నీటి సరఫరాలో ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా అవసరమైన మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని తెలిపారు.
చలివేంద్రాలకు ఉచితంగా నీటి సరఫరా
వేసవి దృష్ట్యా నగరంలో ఏర్పాటుచేసే చలివేంద్రాలకు ట్యాంకర్ల ద్వారా జలమండలి ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, తదితరులు పాల్గొన్నారు.