మేడ్చల్ మల్కాజ్గిరి : ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్(ICMR) సలహాదారు బీపీ ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శామీర్పేట పీహెచ్సీ సిబ్బంది సహాయంతో జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఈ టీకా ఉత్సవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా, బయోలాజికల్ ఈ, ఇతర సంస్థలకు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులకు కొవాగ్జిన్ మొదటి డోసు ఇచ్చారు.
ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ ఉధృతంగా కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని, వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పక పాటించాలని సూచించారు. టీకా ఉత్సవ్ నిర్వహించినందుకు నిర్వాహకులకు ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలిపారు.