ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి
సిటీబ్యూరో,జూలై 6 (నమస్తే తెలంగాణ): భద్రత, సురక్షిత రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది.
దేశవ్యాప్తంగా 756 ప్రధాన రైల్వేస్టేషన్లలో వీడియో సర్వేలెన్స్ సిస్టం (వీఎస్ఎస్)ను ప్రవేశ పెడుతుండగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 76 స్టేషన్లలో అమలు చేస్తున్నట్లు తెలిపింది. సర్వేలెన్స్ ప్రాజెక్టును వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.