సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఐటీ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని టీటా అధ్యక్షుడు సందీప్ మఖ్తల పిలుపునిచ్చారు. బుధవారం టీటా సంస్థ నాయకులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 22,68,500మందికి పైగా ఉన్నారని, వారంతా ఓటు హక్కును వినియోగించుకునేల కంపెనీలు ప్రోత్సహించాలని కోరారు.