హైదరాబాద్ : ప్రైవేటు ఆస్పత్రుల అధిక ఫీజు వసూళ్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. నగరంలోని బంజారాహిల్స్లో గల విరించి ఆస్పత్రి సహా మరో నాలుగు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విరించి, విన్, టీఎక్స్, నీలిమ, మ్యాక్స్ హెల్త్ ఆస్పత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ను వైద్యారోగ్యశాఖ రద్దు చేసింది. గతేడాది కరోనా సంక్షోభంలోనూ ఇదే కారణంతో విరించి ఆస్పత్రి కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు అయిన సంగతి తెలిసిందే.