కీసర, మార్చి 24: కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభోపేతంగా జరిగింది. మూడు రోజులగా విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు అత్ంయత వైభోపేతంగా జరుగుతున్నాయి. ఆలయంలో గజస్తంభం ప్రతిష్ఠను వెంపటి ప్రభాకర్శర్మ, బబ్లూ, బంటి, కౌశిక్, మహానంద్శర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. గురు వందనం శాంతిపా ఠం, నిత్యపూజ, గర్తన్యాసం, 10.10గంటలకు గర్భాలయంలో యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాశీ మలయాలస్వామి పీఠాధిపతులు సర్వేశ్వర అనందగిరి స్వామి నిర్వహించారు. అనంతరం యాగశాలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కీసరలో నూతన ఆలయం లో స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఆలయ చైర్మన్ వెంకటేశ్ దంపతులు స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు.
కీసరలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి విచ్చేశారు. ఆలయ చైర్మన్ నాయకపు వెంకటేశ్ ముదిరాజ్ ఆయనకు ఘనంగా స్వా గతం పలికారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రిని ఆలయ చైర్మన్ సత్కరించారు. హరివర్ధన్రెడ్డి, కొంపల్లి మోహన్రెడ్డి, కీసర ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, ఉప సర్పంచ్ తటా కం లక్ష్మణ్శర్మ, మాజీ ఎంపీటీసీ బెలిదే రమేశ్గుప్త, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణతిగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.