హైదరాబాద్ : పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని, పరిషత్ ఎన్నికలను వాయిదా వెయ్యాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి25 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్నారు. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం విద్యార్థి పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. తగిన సిబ్బంది లేక అనేక ఇబ్బందులు ఉంటాయి.
ఎన్నికలు ముఖ్యమా? విద్యార్థుల చదువులు ముఖ్యమా? అని ప్రశ్నించారు. మార్చి నెలాఖరులోగా పరిషత్ ఎన్నికలు జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టొద్దనారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు వాయిదా వెయ్యాలి అని రామకృష్ణ డిమాండ్ చేశారు