సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో స్వాధీనం చేసుకున్న 617 వాహనాలను ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో వాటిని బహిరంగ వేలంలో విక్రయించనున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఎవరైనా యజమానులు ఉంటే కమిషనర్ కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈ ప్రకటన వెలువడిన ఆరు నెలల్లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు ఆర్ఐ నర్సింహామూర్తి(9490616637), www.hyderabadpolice.gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.