కేపీహెచ్బీ కాలనీ, మే 9: కేపీహెచ్బీ కాలనీ రైతుబజార్లో కూరగాయల ధరలు (కేజీ-రూపాయలు) కింది విధంగా ఉన్నాయి. టమాట రూ.13, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.35, బజ్జి మిర్చి రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ రూ.40, క్యాబేజి రూ.10, ఫ్రెంచ్ బీన్స్ రూ.125, క్యారెట్ రూ.23, కాలీఫ్లవర్ రూ.23, దొండకాయ రూ.21, చిక్కుడు రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్రూట్ రూ.21, క్యాప్సికం రూ.45, ఆలుగడ్డ రూ.25, కీరా రూ.23, దోసకాయ రూ.18, సొరకాయ రూ.12, పొట్లకాయ రూ.15, కందగడ్డ రూ.85, ఉల్లిపొరక రూ.35, ఉల్లిగడ్డ రూ.18.
మామిడికాయ(1) 15 నుంచి 20, అరటికాయ(1) 8 నుంచి 9, చామగడ్డ రూ.35, ముళ్లంగి (1) 4 నుంచి 5, మొరంగడ్డ రూ.30, గుమ్మడికాయ రూ.25, నిమ్మకాయలు(12) రూ.60 నుంచి 70, మునగకాయ(1) 5 నుంచి 6, పొప్పడికాయ రూ.40, పుట్టగొడుగులు రూ.40, ఎండుమిర్చి రూ.160, అల్లం రూ.80, వెల్లుల్లి రూ.140, చింతపండు రూ.160, కరివేపాకు రూ.70గా ఉన్నాయి. ఈ ధరలు శనివారం ఉదయం 9.30 గంటల వరకు రైతుబజార్లో అమలులో ఉంటాయని ఎస్టేట్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు.