అడ్డగుట్ట, మార్చి 1: హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి, పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న ఓ ఖైదీని వారాసిగూడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ శంకర్ కథనం ప్రకారం.. సుబ్రహ్మణ్యం తిలక్ అలియాస్ తిలక్ రాజ్ (40) 2003లో జరిగిన ఒక హత్య కేసులో నేరం రుజువైంది. దీంతో అతడికి 2005లో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2020లో 30 రోజుల పెరోల్పై విడుదలైన అతడు..
పెరోల్ కాలం ముగిసినా జైలు అధికారుల ముందు లొంగిపోలేదు. చిరునామాలు మారుస్తూ, తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తన వివరాలు వెల్లడి కాకుండా తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ కుటుంబంతో గడుపుతున్నాడు. సోషల్ మీడియా అప్లికేషన్లను వినియోగించి, శుక్రవారం మధ్యాహ్నం చాకచక్యంగా తిలక్ను వారాసిగూడ పోలీసుల అదుపులో తీసుకున్నారు. అతడిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.