ఒక నాయకుడి విజన్.. కాంక్రీట్ జంగల్ అయిన నగరానికి ఊపిరిలూదుతున్నది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయిన నగరవాసికి ఆరోగ్యాన్నిస్తున్నది. ఆహ్లాదాన్ని పంచుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ప్రగతి యజ్ఞంతో ప్రజలకు పచ్చని సౌభాగ్యాన్ని అందిస్తున్నది. దేశం చూపును ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీ రక్షణ, పునరుజ్జీవ చర్యలతో.. ఏ ఇతర మెట్రో నగరాల్లో లేనివిధంగా పచ్చదనం ఫరిడవిల్లుతున్నది. ఇప్పటికే 60 వేల ఎకరాల్లో 59 అర్బన్ పార్కులను ప్రారంభించిన హెచ్ఎండీఏ గురువారం మరో ఆరు అర్బన్ పా ర్కులను అందుబాటులోకి తెచ్చింది. మహేశ్వరం నియోజకవర్గంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఒకే రోజు ఆరు పార్కులు ప్రారంభించి నగరానికి మరో పచ్చలహారాన్ని తొడిగారు. శరవేగంగా విస్తరిస్తున్న మహానగరానికి లంగ్స్పేస్ను అందించేందుకు అర్బన్ పార్కులను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితారెడ్డి కృతజతలు తెలిపారు.
నాగారం అర్బన్ ఫారెస్టు పార్కు
సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ)/కందుకూరు/మహేశ్వరం : అటవీ రక్షణ, పునరుజ్జీవ చర్యలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్ ఫారెస్టు పార్కులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, సందర్శకులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పీసీసీ ఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, హెచ్ఎండీఏ డైరెక్టర్ ప్రభాకర్, ఎస్ఈ హుస్సేన్, అసిస్టెంట్ డైరెక్టర్ రాములు, ఎఫ్డీఓ విజయానందరావు, వైల్డ్ లైఫ్ బోర్డుమెంబర్ రాఘవ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీలు రఘుమారెడ్డి, మంద జ్యోతి పాండు, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, అంగోతు రాజునాయక్, కాకి దశరథ, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, సత్యనారాయణ, ఈశ్వర్గౌడ్, మేఘనాథ్రెడ్డి, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరిగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, ఎంపీడీవో నర్సింహులు, తాసీల్దార్ ఆర్పీ జ్యోతి, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, సర్పంచ్లు బండారు లావణ్యలింగం, మద్ది సురేఖ కరుణాకర్రెడ్డి, జంగిలి పరంజ్యోతి, కాసుల సురేశ్, మోతీలాల్నాయక్, సాలీవీరానాయక్, ఈర్లపల్లి భూపాల్రెడ్డి, జ్యోతి చంద్రశేఖర్, కాసుల రామక్రిష్ణరెడ్డి, గంగాపురం గోపాల్రెడ్డి, కాకి ఇందిరమ్మ, తొంట రవీందర్, ఎంపీటీసీలు కాకి రాములు, సురేశ్, యాదయ్య, మూల హన్మంత్రెడ్డి, సామయ్య, అలీ, కొండల్రెడ్డి, మోహన్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, డైరెక్టర్లు రవీందర్నాయక్, కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య, అంబయ్యయాదవ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, ఆనేగౌని దామోదర్గౌడ్, అమరేందర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, విజ్ఞేశ్వర్రెడ్డి, బొక్క దీక్షిత్రెడ్డి, అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
8వ విడతలో 19.54 కోట్ల మొక్కలు లక్ష్యం
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నగరవాసులకు మరో ఆరు అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి రావడం సంతోషంగా ఉన్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అడవులను రక్షించి, పచ్చదనం పెంచాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 258 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. 8వ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో గురువారం ఒక్కరోజే ఆరు అర్బన్ పార్కులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సుమారు రూ.22 కోట్లతో హెచ్ఎండీఏ ఈ పార్కులను అభివృద్ధి చేసిందని చెప్పారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఎంపీ సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను కూడా ఇందులో భాగస్వాములను చేశారన్నారు.
వారంలో ఒకరోజు స్థానికులకు ఉచిత ప్రవేశం
మంత్రి సబితాఇంద్రారెడ్డి
విజన్తో పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని, అందుకు హరితహారం కార్యక్రమమే నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించేవారని, సీఎం కేసీఆర్ దీన్ని ఒక యజ్ఞంలా మార్చి ప్రజలందరినీ భాగస్వామ్యులను చేశారని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ, హెచ్ఎండీఏను అభినందించారు. అటవీ భూములు, అర్బన్ ఫారెస్టు పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు. వారంలో ఒకరోజు స్థానికులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్ చుట్టుపక్కల అర్బన్ లంగ్ స్పేస్ క్రియేట్ చేసేందుకు అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అర్బన్ ఫారెస్టు పార్కు లలో ఏర్పాటు చేసిన వాకింగ్ట్రాక్, జిమ్
మంత్రి కేటీఆర్ ట్వీట్
ఒకేరోజు ఆరు అర్బన్ ఫారెస్టు పార్కులు అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘బహుశా దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాల్లో హైదరాబాద్లో మాదిరిగా లంగ్ స్పేస్ లేదు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సహచర మంత్రులు గురువారం ఆరు అర్బన్ ఫారెస్టు పార్కులను ప్రారంభించారు. హెచ్ఎండీఏ 60వేల ఎకరాల్లో 59 అర్బన్ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేసింది. ఇందులో కేవలం పదహారు పార్కులే పదిహేను వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి..’ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
అందుబాటులోకి 65 అర్బన్ ఫారెస్టు పార్కులు
రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్టు పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయిచారు. రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కులకు ఇప్పటివరకు రూ.400 కోట్లు ఖర్చు చేశారు. 59 అర్బన్పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం మరో ఆరు అర్బన్ ఫారెస్టు పార్కులు కలుపుకొని మొత్తం 65 అందుబాటులోకి వచ్చాయి. సందర్శకుల కోసం ఎంట్రీ ప్లాజా, విజిటర్స్ పాత్వే, ఇంటర్ప్రెటేషన్, షెడ్డు, గ్యాప్ ప్లాంటేషన్, అటవీ ప్రాంతమంతా రక్షణ గోడ, బోర్వెల్స్, పైపులైన్, ఇతర సౌకర్యాలు కల్పించారు.