ఉప్పల్, మే 1 : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మం జూరైన చెక్కులను సోమవారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్లు శాంతిసాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, తాసీల్దార్ గౌతమ్కుమార్ హాజరైనారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందన్నా రు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో అన్నివర్గాలకు న్యా యం చేసేవిధంగా పథకాలను రూపొందించారని చెప్పా రు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా తమవంతు కృషి చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూస్తామన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలువాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు, ప్రజల కష్టాలను గు ర్తించి, పనులు చేపడుతున్నారన్నారు. నేతలు గరిక సుధాకర్, సాయిజెన్ శేఖర్, మేకల ముత్యంరెడ్డి, బుచ్చన్న, విఠల్యాదవ్, వినీశ్, రాంచందర్, శ్రీధర్ పాల్గొన్నారు.