ఉప్పల్, ఆగస్టు 7 : ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం రెండు ఎకరాల స్థలం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి వినతిపత్రం అందజేశారు. వీటితోపాటు ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిలో కారిడార్ పనులు పూర్తిచేసేలా చూడాలని మంత్రిని కోరారు.
అలాగే జర్నలిస్టుల ఇండ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని, ఉప్పల్ ప్రెస్క్లబ్ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఉప్పల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఉప్పల్ జర్నలిస్టులు మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు.