చర్లపల్లి, జనవరి 10 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, సెయిట్ జోసెఫ్ కాలనీలో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, నాయకులు పాండాల శివకుమార్గౌడ్, నేమూరి మహేశ్గౌడ్, గణేశ్ ముదిరాజ్, చల్లా వీరేశం, నాగిళ్ల బాల్రెడ్డి, చల్లా వెంకటేశ్, చక్రపాణిగౌడ్, సారా అనిల్, కిశోర్గౌడ్, రాజేశ్వర్రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్లతో పాటు కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొనారు.
చర్లపల్లి డివిజన్ గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని సర్వే నం 278లో గౌడ కులస్తులకు కేటాయించిన స్థలంలో జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు నిర్మాణాలు చేపట్టడంతో గౌడ కులస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చర్లపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్రాజుగౌడ్, రాంచందర్గౌడ్, సభ్యులు రాజుగౌడ్, నర్సింహ గౌడ్, నాధం గౌడ్, రాములు గౌడ్, ప్రేమ్కుమార్గౌడ్, బాబుగౌడ్, శ్రీకాంత్గౌడ్, జ్ఞానేశ్వర్గౌడ్, రాములుగౌడ్, క్రాంతిగౌడ్, భానుగౌడ్, రంజిత్గౌడ్, రాకేశ్గౌడ్, సాయిరాంగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు నేమూరి మహేశ్గౌడ్ పాల్గొన్నారు.