ఉప్పల్ జోన్ బృందం, ఆగస్టు 21 : ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సోమవారం టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో స్వీట్లు పంచిపెట్టారు. జై తెలంగాణ… జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మూడు నెలల ముందుగా అభ్యర్థిని ప్రకటించడంపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతల రాకతో బండారి నివాసం కిటకిటలాడింది. గులాబీ జెండాలు, గులాబీ శ్రేణుల సంబురాలతో సందడి నెలకొంది.
తాసీల్దార్ కార్యాలయం చౌరస్తావద్ద మధ్యాహ్నం నుంచే బీఎల్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తల సందడి మొదలైంది. అనంతరం పెద్ద ఎత్తున చౌరస్తావద్దకు చేరుకుని జై బీఎల్ఆర్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి భారీ కటౌట్కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బండారి లక్ష్మారెడ్డి నివాసం, బీఎల్ఆర్ ట్రస్ట్ కార్యాలయాల వద్ద మధ్యాహ్నం నుంచే సందడి ప్రారంభమైంది. భారీ గజమాలను క్రేన్ సహాయంతో తెచ్చి లక్ష్మారెడ్డిని సత్కరించారు. అభిమానులు, కార్యక ర్తలు ఆనందోత్సాహాలతో బీఎల్ఆర్ను పూలమాలలతో ముంచెత్తారు.
కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. అదేవిధంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఉప్పల్ నియోజక వర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డి పేరు ప్రకటించడం పట్ల రామంతాపూర్ ప్రధాన రహ దారిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీ రామారావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంబురాలలో బీఆర్ఎస్ నాయకులు సూరం శంకర్, సంబేటి నరేశ్, బోసాని పవన్కుమార్, రాజు యాదవ్, కృష్ణాయాదవ్, చిన్నా, యాకాంత్, అరవింద్, టిల్లు యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డి పేరు ప్రకటనతో మల్లాపూర్, మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్రావుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు తినిపించుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ సంబురాల్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, కటార్ల భాస్కర్, తండా వాసుగౌడ్, కుంటి కృష్ణ, సానల రవి, రాపోలు సతీశ్, ఉపేందర్రెడ్డి, కోటేశ్వరి, హెచ్బీకాలనీ డివిజన్లో గుమ్మడి జంపాల్రెడ్డి, నవీన్గౌడ్, రమేశ్, ఫర్వీన్, భారతి, లక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.