సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో ఉప్పల్ పోలీస్స్టేషన్ నంబర్ వన్గా నిలిచిందని, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 19 పోలీస్స్టేషన్లలో మొదటి నుంచి 10వ ర్యాంకు వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు దక్కించుకున్నాయని సీపీ మహేశ్భగవత్ వెల్లడించారు. డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో మంగళవారం ఫంక్షనల్ వర్టికల్స్, ్రక్రైమ్ రివ్యూ తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఠాణాలు, అధికారులకు ర్యాంకులు ఇచ్చారు.
ఇందులో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని ఉప్పల్ పోలీస్స్టేషన్ 1001 నుంచి 1911 కేసులు నమోదైన ఠాణాల విభాగంలో బెస్ట్ పోలీస్స్టేషన్గా నిలువగా, సరూర్నగర్, మల్కాజిగిరి, మేడిపల్లి, నేరేడ్మెట్, ఎల్బీనగర్, హయత్నగర్, జవహర్నగర్, కుషాయిగూడ, వనస్థలిపురం, మీర్పేట్ పోలీస్స్టేషన్లు మొదటి 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సీపీ మహేశ్ భగవత్, అదనపు సీపీ సుధీర్బాబులు ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలను సన్మానించారు.
సన్మానం అందుకున్న ఎస్హెచ్ఓలు వరుసగా గోవిందరెడ్డి, కె.సీతారాం, బి.జగదీశ్వర్రావు, జి.గోవర్ధనగిరి, నర్సింహ స్వామి, బి.అంజిరెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, కె.చంద్రశేఖర్, పి. వెంకటేశ్వర్లు, కె.సత్యనారాయణ, ఎం.మహేందర్రెడ్డి ఉన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 42 మంది పోలీసులకు ఈ సందర్భంగా సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి, ఉమెన్ సేఫ్టీ డీజీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ సి.నర్మద, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.