హైదరాబాద్ : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలు ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy) ప్రశ్నించారు. గురువారం ముషీరాబాద్ నియోజక వర్గం లో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వెనుకా ముందు చూసుకోకుండా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటినా హామీల అమలు ఊసేలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటో ప్రజలు ఓటు సమాధానం చెబుతారన్నారు.