Traffic Restrictions | సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ఎల్బీస్టేడియంలో బీజేపీ సమావేశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.