హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shmshabad) మండలం ఘాన్సీమియా గూడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్య(Brutal murder)కు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో పొడిచి బండరాళ్లతో మోది హతమర్చారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద దొరికిన ఓ బ్యాగ్ ఆధారంగా మృతుడి వివరాలను తెలుసుకున్నారు. హత్యకు గురైన యువకుడు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మల్లేష్గా గుర్తించారు.
కొన్నాళ్ల క్రితం భార్య వదిలిపెట్టడంతో శంషాబాద్ ప్రాంతానికి వచ్చి అడ్డాకులిగా మారాడు. అయితే అప్పుడప్పుడు ఘాన్సీమియా వద్ద ఉన్న టెంట్ హౌస్లో పనిచేసి పక్కనే ఉన్న ఓ గుడిలో తల దాచుకునేవాడు. కాగా, రాత్రి ఘాన్సీమియా గూడా వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన నిర్జీవంగా పడి ఉన్నాడు. సమాచారం అదుకున్న పోలీ సులు సంఘటనా స్థలానినికి చేరుకొని ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.