Unemployees | అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడంతోపాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్ల తర్వాత మొక్కుబడిగా త్వరలో 5000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నోటిఫికేషన్లను విడుదల చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
పోలీస్ ఉద్యోగాలను 5000 నుండి 20000కు పెంచాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరుద్యోగులు రోడ్డెక్కారు. దిల్ సుఖ్ నగర్ మెట్రో వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టగా.. నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచమని నిరసన తెలుపుతున్న నేపధ్యంలో నిరుద్యోగులను చిక్కడపల్లి లైబ్రరీ లోపల నిర్భంధించిన పోలీసులు గేటుకు తాళం వేశారు.
నిరుద్యోగులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గేట్ తీయమని ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించకపోవడం నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో చెప్పకనే చెబుతోంది.
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచమని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలింపు https://t.co/xo8ZxUskcI pic.twitter.com/Wq62J5lzXg
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2026
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’