Prisoner | హైదరాబాద్ : చంచల్గూడ సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ముడావత్ జాను(36) ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముడావత్ జాన్ను ఓ దొంగతనం కేసులో రాజేంద్రనగర్ పోలీసులు ఫిబ్రవరి 6వ తేదీన అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. చంచల్గూడ జైల్లో ఉన్న జాన్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని అదే రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం జాన్ మృతి చెందాడు. మృతుడి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.