హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఆటోతో పోకిరీలు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న పోకిరీలు.. ఆటోను ర్యాష్గా నడిపారు. ఆటోతో రోడ్డు మీద వెళ్తున్న పలువురిని ఢీకొట్టారు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. అలాగే.. వాహనదారులపై దాడి చేసి సెల్ఫోన్లు లాక్కున్నారు. పోకిరీల ఆగడాలను తట్టుకోలేక.. స్థానికులు వాళ్లను పట్టుకొని చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆటోతో సహా.. ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.