సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్లు మంగళవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.
గుంతకల్ – రాయచూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే, ముంబై – కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రెండు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.