జగద్గిరిగుట్ట, ఏప్రిల్ 18: సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు క్వారీ నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మబండకు చెందిన షేక్ అయాన్(15), షేక్ నవాజ్(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. వీరి మిత్రుడు హైదర్తో కలిసి గురువారం మధ్యాహ్నం గాజులరామారం పరిధిలోని దేవేందర్నగర్ సమీపంలో ఉన్న క్వారీ నీటి గుంతల వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగిన ఆయాన్, నవాజ్కు ఈత రాకపోవడంతో మునిగారు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో గట్టు సమీపంలో ఉన్న హైదర్ భయపడి.. విషయాన్ని స్థానికులకు తెలిపాడు. దీంతో పోలీసులు, స్థానికులు కలిసి నీట మునిగిన ఇద్దరినీ బయటకు తీశారు. ప్రగతీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారిద్దరూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్.. వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.