అంబర్పేట, నవంబర్ 4: బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు డివైడర్ను ఢీకొట్టి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన పాలడుగు రాజు సన్ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. రాంనగర్లోని మరో ఆరుగురు సూర్య, రాజేశ్, రాహుల్రెడ్డి, గణేశ్, అనీశ్, భావన్, రోషన్తో కలిసి ఉంటున్నాడు. వీరంతా ఒకే కళాశాలలో చదువుతున్నారు.
గురువారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఓయూ మాణికేశ్వరనగర్ వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్కు నాలుగు బైకులపై వెళ్లిన వీరు పెట్రోల్ పోయించుకున్నారు. ఆ తర్వాత రెండు గంటల సమయంలో వీరిలో కామారెడ్డికి చెందిన నస్కంటి భావన్(20), నిర్మల్కు చెందిన మాలెపు రోహన్(20) ఇద్దరు కలిసి బుల్లెట్ మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. బైక్ను భావన్ నడిపిస్తున్నాడు. అతి వేగంగా, నిర్లక్ష్యంతో బైక్ నడిపించడంతో అదుపుతప్పి ఫ్లైఓవర్ డివైడర్ను ఢీకొట్టాడు. ఇద్దరి తలలకు బలంగా గాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పాలడుగు రాజు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.