వనస్థలిపురం, మే 3 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. వనస్థలిపురం డాక్టర్స్ కాలనీలో నివాసముండే రమావత్ రాజు, అతడి స్నేహితుడు సందీప్రెడ్డితో కలిసి సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్కు యాక్టివా బైక్పై వస్తున్నారు.
రాత్రి 11గంటల సమయంలో గుర్రంగూడ చౌరస్తాకు రాగానే ఎదురుగా వస్తున్న ఎవేంజర్ బైక్(టిఎస్30బి6145)ని ఢీకొట్టారు. దీంతో రెండు బైక్లపై ఉన్న నలుగురు కిందపడిపోయారు. యాక్టివా బైక్ వెనుక కూర్చున్న రాజు, ఎవేంజర్ బైక్ వెనుక కూర్చున్న ఎండి రిజ్వాన్లు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
గాయాలపాలైన సందీప్రెడ్డి, రాజు, ఖలేద్లను ఆస్పత్రికి తరలించారు. కాగా యాక్టివా బైక్ నడుపుతున్న సందీప్రెడ్డి నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.