కాచిగూడ,జూన్ 17 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని(Train collision) గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ హెడ్కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(35)సోమవారం ఉప్పుగూడ-యాకత్పుర రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నీలి రంగు ప్యాంట్, కాకి రంగు చొక్క ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు.
మృతుని వివరాల కోసం 8712568495లో సంప్రదించాలని కోరారు. మరో సంఘటనలో.. గుర్తుతెలియని వ్యక్తి(30) ఆదివారం అర్ధరాత్రి మలక్పేట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఆకుపచ్చ రంగు చొక్క, బుడిద రంగు ప్యాంట్ ధరించి,ఎత్తు 5.3 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 8712568495లో సంప్రదించాలని పోలీసులు కోరారు.