చాదర్ఘాట్, జూలై 13: వేర్వేరు చోట్ల మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. చాదర్ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫర్హత్నగర్కు చెందిన లియాకత్ అలీ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. నల్గొండ చౌరస్తాలోని సోహెల్ హోటల్ ఎదురుగా రోడ్డుపై మరమ్మతులు చేపట్టడంతో పెద్ద గుంత ఏర్పడింది.
ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బారికేడ్ను సరిచేసేందుకు వెళ్లిన లియాకత్ అలీని మలక్పేట వైపు వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో చనిపోయాడు. డీసీ పటేల్ కాలనీ ఫర్హత్నగర్ వాసి మహ్మద్ హనీఫ్(50) మలక్పేట రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.