హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు తమ కారును వేగంగా నడుపుతూ మాదాపూర్ సాయినగర్లో బైకును ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోకి దూసుకెళ్లారు. ఓ పిల్లర్ను గుద్దుకోవడంతో కారు ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. అపార్ట్మెంట్ గేటు ధ్వంసమవగా, బైక్పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాదం తెల్లవారుజామున 3.15 గంటలకు జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.