హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు హైటెక్సిటీ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు కారులో ఉన్న యువతి, యువకుడిని బయటకు తీశారు. సమాచారం అందికున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో యువతి కారు నడుపుతున్నట్లు, ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.