చర్లపల్లి, ఆగస్టు 15 : బ్యాటరీ పేలి రెండు ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ సాయినగర్లో నివాసముండే హరిబాబు ప్రైవేట్ ఉద్యోగి.
ఇటీవల రెండు ఎలక్ట్రిక్ బైక్లు కొన్నాడు. సోమవారం సాయంత్రం వాటిని చార్జింగ్ చేస్తుండగా, బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయి.. బండ్లు పూర్తిగా కాలిపోయాయి.