రంగారెడ్డి : రంగారెడ్డి (Rangareddy)జిల్లాలోని మంచిరేవుల(Manchirevula)లో తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమవడం(Disappeared )స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తు..భవాని, మహేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భవాని తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య, పిల్లల ఆచూకీ కోసం మహేష్ బంధువులు, పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.