హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో నటుడు ప్రభాకర్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టడమే కాకుండా నాలుగేండ్లుగా నిరంతరాయంగా కొనసాగించడం గొప్పవిషయం అన్నారు. ప్రతీ పుట్టినరోజున మొక్కలు నాటుతున్నాని చెప్పారు. రేపటి తరాలకు మంచి ఆక్సిజన్, వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడం చాలా మంచి పరిణామని అన్నారు. దేశానికి కేసీఆర్ పాలన అవసరని వెల్లడించారు. ఇంతటి మహాయజ్ఞంలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.