TSRTC | హైదరాబాద్ : సికింద్రాబాద్ – మణికొండ మార్గంలో కొత్తగా బస్సు సర్వీసులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. 5కే, 5ఎం నంబర్ బస్సులు మెహిదీపట్నం మీదుగా మణికొండ వరకు సర్వీసులందించనున్నాయి. ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి బాటా, బైబిల్ హౌస్, ట్యాంక్బండ్, సచివాలయం, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, టోలీచౌకి, దర్గా, ఓయూ కాలనీ, పంచవటి కాలనీ మీదుగా మణికొండ వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి.
సికింద్రాబాద్ – మణికొండ మార్గంలో తొలి సర్వీసు ఉదయం 6:05 గంటలకు, చివరి సర్వీసు సాయంత్రం 5:17 గంటలకు ఉంటుంది. అలాగే మణికొండ – సికింద్రాబాద్ మార్గంలో తొలి సర్వీసు ఉదయం 7:15 గంటలకు, చివరి సర్వీసు సాయంత్రం 6:37 గంటలకు ఉంటుంది. ప్రయాణికులు ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.