మారేడ్పల్లి, డిసెంబర్ 29: అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం జనవరి 5వ తేదీన హైదరాబాద్ నుంచి శబరిమలకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రత్యేక సర్వీసు బస్సు బయలుదేరి, 3 గంటలకు మహాత్మాగాంధీ నుంచి శబరికి బయలుదేరుతుందన్నారు.
ఈ సర్వీసులో శబరిమలతో పాటు జోగులాంబ, కాణిపాకం, భవానీ, గురువాయర్, ఛోటానిక్కర్, ఎరుమేలి, పంబ, తిరువనంతపురం, మధురై, అరుణాచలం, కంచి, మహానంది దర్శనం ఉంటుందన్నారు. ఒక ప్రయాణికుడికి భోజన వసతితో కలిసి రూ.13,940 ఉంటుందని, వివరాలకు పికెట్ డిపో 9959226250, స్టేషన్ మేనేజర్ జేబీఎస్ 9959226246 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.