TSRTC | అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని అనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్యాకేజీ వివరాలను టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
☛ జూలై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సు ( సర్వీస్ నంబర్ 98889 ) బయల్దేరనుంది.
☛ ముందుగా ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.
☛ గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జూలై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్కు వెళ్తుంది. అక్కడ దర్శనం అనంతరం మరుసటి రోజు (జూలై 4వ తేదీన ) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
☛ ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
☛ ఆసక్తి ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు.