కంటోన్మెంట్, మార్చి 24: కంటోన్మెంట్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నయా జోష్ కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే సాయన్న రాజకీయ చతురతకు పట్టభద్రుల ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఈసారి 61.19శాతం మేర పోలింగ్ జరగడమే కాకుండా పట్టభద్రులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా పక్కా వ్యూహంతో ముందుకు సాగి ఫలితాన్ని రాబట్టడంతో సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి ఎమ్మెల్యే సాయన్న పక్కా ప్రణాళికతో ఎన్నికల ప్రచార సరళిని ఎక్కడా తగ్గకుండా పట్టభద్రులను ఒకటికి మూడుసార్లు కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసేలా కృషి చేయడంలో విజయవంతమయ్యారు. అదే విధంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంతో పాటు వారికి బాధ్యతలు అప్పటించి మానిటరింగ్ చేశారు.దీంతో పార్టీ చెప్పిన గీత దాటకుండా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో పాటు బోర్డు మాజీ సభ్యులు సదా కేశవరెడ్డి, అనితాప్రభాకర్, నళినికిరణ్, పాండుయాదవ్, లోక్నాథంతో సహా బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్లు సంయుక్తంగా ఎన్నికల్లో విధు లు నిర్వర్తించి పార్టీ కార్యకర్తల్లో మనోైస్థెర్యాన్ని నింపారు. ఎప్పటికప్పుడు కమలం పార్టీ నేతల వ్యూహాలకు చెక్ పెడుతూ పార్టీ ప్రతినిధులకు దిశానిర్ధేశం చేయడంలో ఎమ్మెల్యే సాయన్న కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను కలువడంతో పాటు పట్టభద్రులైన యువతను కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించి ఓటును వేయాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది.
ఒక్కో ఓటరును మూడుసార్లు కలిసే విధంగా ఇన్చార్జిలకు, ప్రజాప్రతినిధులకు లక్ష్యాలను నిర్ధేశించడంతో అనుకున్న ఫలితం వచ్చింది. పోలింగ్ సమయంలో కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను సజావుగా చేపట్టారు. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతాన్ని పెంచే విధం గా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే సాయన్న పోలింగ్ నాడు దగ్గరుండి ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చే విధంగా ప్రయత్నించారు. దీంతో గతంలో కంటే ఎక్కువగా కంటోన్మెంట్ ప్రాంతం లో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 4,784 ఓట్ల పోలింగ్ నమోదు కావడంతో సుమారు 3వేలకు పైగా ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు చాలెంజ్గా తీసుకుని పట్టభద్రుల ఎన్నికల్లో నిర్విరామంగా, నిరంతరంగా ప్రచారం చేసి పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై వివరించారు.
చిరునామా ఈ ప్రాంతంలో ఉండి ఓటు హక్కు ఇక్కడి పోలింగ్ కేంద్రంలో ఉన్నా ఓటరు ఎక్కడో ఉన్నా ఓటు వేసే విధంగా వారితో నిరంతరం మాట్లాడి చైతన్యం నింపి పోలింగ్ కేంద్రానికి వచ్చే విధంగా కృషి చేశారు. ఇలా దాదాపు 800 నుంచి 1000 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు.ఎన్నో వ్యూహాలు, పకడ్బందీ ప్రణాళికలతో కంటోన్మెంట్ ప్రాం తంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికంగా ఓట్లు రాబట్టడంలో ఎమ్మెల్యే సాయన్న నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు చాలెంజ్గా తీసుకుని పట్టుదలగా కష్టపడడంతో ఫలితం అనుకూలంగా వచ్చింది. దీం తో కంటోన్మెంట్లోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊరకలేస్తుంది. రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో సైతం బోర్డుపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.