నగరమంతా ఆవిర్భావ వేడుకలు
టీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీలు, సేవా కార్యక్రమాలు
దేశ ప్రగతికి బాటలు వేద్దామని పిలుపు
సిటీబ్యూరో/ మేడ్చల్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : భాగ్యనగరి గులాబీ మయమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం ముస్తాబవగా.. బుధవారం గులాబీ జెండాలు ఎగిరాయి. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలోనూ స్థానిక నాయకులు జెండా పండుగ నిర్వహించారు.
అనేక చోట్ల టీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ దేశ గతిని మార్చేందుకు గులాబీ దండు కదిలిందని చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసేందుకు తెలంగాణ సమాజం ముందుండాలని పిలుపునిచ్చారు.
రహీంపురాలో మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జెండాను టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్సింగ్ రాథోడ్, రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్తో కలిసి ఎగుర వేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
అంజయ్యనగర్లో తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకురాలు భారతమ్మను సత్కరిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, తదితరులు
బంజారాహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి