ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
పలు చోట్ల పార్టీ జెండాలు ఆవిష్కరణ
పాల్గొన్న కార్పొరేటర్లు, కార్యకర్తలు
జూబ్లీహిల్స్ జోన్ బృందం,ఏప్రిల్27: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు వాడవాడలా పార్టీ జెండాలను ఎగురవేశారు. ఒక్కో డివిజన్లో 20చొప్పున పార్టీ పతాకాలు ఎగురవేయడంతో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు స్థానిక టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రహ్మత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్రెడ్డి 20 ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10 లో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ నాయకులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
వెంగళరావునగర్ డివిజన్లో పార్టీ నాయకులతో కలిసి కార్పొరేటర్ దేదీప్య విజయ్ 18 ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బోరబండ డివిజన్లో నగర మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ నాయకులతో కలిసి 21చోట్ల జెండాలను ఆవిష్కరించారు. ఎర్రగడ్డలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ ఆధ్వర్యంలో పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం మోతీనగర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొనందుకు ఎమ్మెల్యే నాయకత్వంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్కుమార్ పటేల్, దేదీప్య విజయ్లతో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు తరలివెళ్లారు.
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స వాన్ని డివిజన్లో ఘనంగా నిర్వహించారు. అన్ని ముఖ్య కూడళ్లలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. బన్సీలాల్పేట్లోని అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల వద్ద పార్టీ జెండాను కార్పొరేటర్ కే.హేమలత ఎగురవేశారు. పద్మారావునగర్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్కుమార్ గౌడ్, చాచానెహ్రూనగర్లో కే.లక్ష్మిక్ష్మీపతి, ఐడీహెచ్ కాలనీలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, జీవైఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో అధ్యక్షుడు వెంకట్బాబు, సీసీనగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో అధ్యక్షుడు నర్సింగ్రావు, బోయిగూడలో ఉద్యమకారుడుశ్రీనివాస్, బోయిగూడ జయశంకర్సార్ విగ్ర హం వద్ద ఉద్యమకారుడు ఎస్.రాజేందర్, బన్సీలాల్పేట్లో ఉద్యమకారుడు కమల్కుమార్, భోలక్పూర్లో నాయకుడు మహేశ్, జీకేకాలనీలో అధ్యక్షుడు కేఎమ్.కృష్ణ టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు.
బేగంపేట్ ఏప్రిల్ 27: రాంగోపాల్పేట్ బేగంపేట్ డివిజన్లలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో బేగంపేట్ డివిజన్లో నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ డివిజన్లోని మయూరిమార్గ్, పాటిగడ్డ, శ్యాంలాల్ బిల్డింగ్ ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్ డివిజన్లోని ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.