సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, డిప్యూటీ మేయర్, పార్లమెంట్, నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలన్నారు.
నియోజకవర్గంలోని డివిజన్ స్థాయిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా సూచించారు.