హైదరాబాద్ : ఉబ్బసం వ్యాధి బాధితులకు చేప మందును వేస్తున్న బత్తిన హరినాథ్గౌడ్ మరణం పట్ల రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్( Talsani Srinivas Yadav), శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) నివాళి అర్పించారు. మరణం విషయాన్ని తెలుసుకున్న మంత్రులు గురువారం కవాడిగూడ డివిజన్ పద్మశాలీ కాలనీలో నివాసముంటున్న హరినాథ్గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. హరినాథ్ గౌడ్ మృతి బాధాకరమని అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రులు మాట్లాడుతూ ఎంతో మంది ఉబ్బసం వ్యాధి బాధితులకు ఉపశమనం కల్పించిన గొప్ప వ్యక్తి బత్తిన హరినాథ్గౌడ్ అని అన్నారు. హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు వారసత్వంగా ఉచితంగా చేపప్రసారం పంపిణీ చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. వీరు ఇచ్చే చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తారని అన్నారు.