సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా మారిన హుస్సేన్సాగర్ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాచరణ రూపొందించింది.
ప్రస్తుతం మూడు చోట్ల ఉన్న ఎస్టీపీలతో పాటు మొత్తం 7 చోట్ల ఉన్న ఐ అండ్ డీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. 14 నెలల పాటు హుస్సేన్సాగర్లోకి మురుగునీరు చేరకుండా, శుద్ధి చేసిన నీటిని మాత్రమే వదిలేలా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.7.19 కోట్లు వెచ్చించనున్నారు.