సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘సన్డే-ఫన్డే’ కార్యక్రమం ఉండడంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలకు అనుమతి ఉండదని నగర జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్పై నుంచి రాకపోకలు సాగించే ట్రాఫిక్ను ఆ నిర్ణీత సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలోకి మళ్లిస్తున్నట్లు వివరించారు.