సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఇందులో భాగంగా రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డును మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేసి, రోడ్డును మూసివేస్తున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు.
సికింద్రాబాద్లో..
పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా తివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ను బ్రూక్బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.