హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో ఎవరిని అనుమతించమని పేర్కొన్నారు. ఈ సమయంలో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.