హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. 24 గంటల్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసులు నిర్ణయించినప్పటికీ, నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం కురియడంతో ఆలస్యమైంది.
ట్యాంక్బండ్కు వచ్చే రహదారులపై గణనాథులతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్యాంక్బండ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వద్ద వాహనాలు నిలిచాయి. దీంతో ఈ ఏరియాల్లో మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తి కానుంది.